అమెరికాలో వీసా ఫ్రాడ్ కేసు... ఇద్దరు భారత సంతతి వ్యక్తులు దోషులుగా నిర్ధారణ

  • అమెరికాలో హెచ్-1బీ వీసా మోసానికి పాల్పడిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులు
  • నేరాన్ని అంగీకరించిన సంపత్ రాజిడి, శ్రీధర్ మాద అనే వ్యక్తులు
  • యూనివర్సిటీలో లేని ఉద్యోగాలను సృష్టించి వీసాలు పొందినట్లు నిర్ధారణ
  • దోషులకు ఐదేళ్ల జైలు, 2.5 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం 
అమెరికాలో హెచ్-1బీ వీసాల పేరిట భారీ మోసానికి పాల్పడిన కేసులో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించారు. కాలిఫోర్నియాలోని ఓ యూనివర్సిటీలో ఉనికిలో లేని ఉద్యోగాలను సృష్టించి, తద్వారా వీసాలు పొంది మోసం చేసినట్లు వారు అంగీకరించారని అమెరికా అటార్నీ కార్యాలయం ప్రకటించింది.

వివరాల్లోకి వెళితే, కాలిఫోర్నియాలోని డబ్లిన్ నగర నివాసులైన సంపత్ రాజిడి (51), శ్రీధర్ మాద (51) ఈ కుట్రకు పాల్పడ్డారు. శ్రీధర్ మాద, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ (UCANR) విభాగానికి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా తన పదవిని దుర్వినియోగం చేశారు. హెచ్-1బీ వర్కర్లను నియమించుకునే అధికారం లేకపోయినా, యూనివర్సిటీలో ఉద్యోగాలు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. మరోవైపు, సంపత్ రాజిడి తన వీసా సర్వీసింగ్ కంపెనీలైన ఎస్-టీమ్ సాఫ్ట్‌ వేర్ ఇంక్, అప్‌ట్రెండ్ టెక్నాలజీస్ ఎల్ఎల్‌సీ ద్వారా ఈ మోసపూరిత దరఖాస్తులను దాఖలు చేశారు.

జూన్ 2020 నుంచి జనవరి 2023 మధ్య ఈ మోసం కొనసాగింది. అనేక మంది పేరుమీద వీరిద్దరు హెచ్ 1 బీ వీసా పిటిషన్లు దాఖలు చేశారు. కూట్రలో భాగంగానే ఇలా చేసినట్లు దర్యాప్తులో తేలడంతో పాటు నిందితులు కూడా నేరాన్ని అంగీకరించినట్లు కాలిఫోర్నియా అటార్నీ కార్యాలయం తెలిపింది. ఈ కేసులో దోషులకు గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 2,50 లక్షల డాలర్ల భారీ జరిమానా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.  

Sampat Rajidi
H1B visa fraud
Sridhar Madha
California
UCANR
Indian origin
visa scam
US Attorney Office
Dublin California
S-Team Software

More Telugu News